హైదరాబాద్లో బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య

0

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంబిఆర్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఎవరూ లేని సమయంలో గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సంగెపు నరేంద్ర(22) ఇబ్రహీంపట్నంలోని గురు నానక్ ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి స్వస్థలం ఖమ్మం జిల్లా మధిర మండలం మంగూర్ గా గుర్తించారు . ఘటనా స్థలానికి వచ్చిన ఇబ్రహీంపట్నం పోలీసులు విద్యార్థి ఆత్మహత్య పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్లో బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com