పెద్దపల్లి జిల్లాలో క్షుద్ర పూజల కలకలం.. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద తంతు

0

దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నా గ్రామాల్లో పరిస్థితులు మారడం లేదు. టెక్నాలజీ బేస్ చేసుకుని అంతరిక్షంలోకి మానవుడు వెళ్లి వస్తున్నా.. జనం మూఢ నమ్మకాలను విడనాడటం లేదు. తాజాగా, పెద్దపల్లి జిల్లాలో క్షుద్ర పూజలు చేస్తున్న ఘటన కలకలం రేపింది. చందపల్లి ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువ సమీపంలో శనివారం అర్ధరాత్రి కొందరు ఎవరకి అనుమానం రాకుండా చిన్నపాటి టెంట్ వేశారు. అనంతరం అక్కడ ఓ పెద్ద గొయ్యి తవ్వి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉంచి క్షుద్ర పూజలు చేశారు. అయితే, వాకింగ్ కోసం అటుగా వచ్చి స్థానికులు పెద్ద గొయ్యి అందులో పసుపు, కుంకుమ, పసుపు పూసిన నిమ్మకాయలు, గడ్డపార, పార చూసి తీవ్ర భయాందోళకు గురయ్యారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేయగా స్పాట్‌‌ను పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం మేరకు మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com