మూడో అంతస్తు నుంచి పడి మహిళ మృతి (వీడియో)
మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ భవనం మూడో అంతస్తు నుంచి పడిపోవడంతో మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. డోంబివిలీలో తన స్నేహితులతో సరదాగా గడుపుతున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కింద పడిపోయింది. వెంటనే ఆమె స్నేహితులు కిందికి వెళ్లి చూడగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు గుడియా దేవిగా గుర్తించారు.