‘KCR పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు’.. CM రేవంత్‌కు ఈటల స్వీట్ వార్నింగ్

0

బీజేపీ సీనియర్ నేత, ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ఒక్కో ఎగ్జామ్‌కు మధ్య నెల రోజుల గ్యాప్ అయిన ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగుల విషయంలో గత సీఎం కేసీఆర్ కూడా ఇలాగే వ్యవహరించారని.. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసని రేవంత్ సర్కార్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలు వెంట వెంటనే ఉన్నాయని.. దీంతో రెండు పరీక్షలు రాసే వారికి ప్రిపేర్ అయ్యే సమయం లేదని అభ్యర్థులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్షలకు మధ్య గ్యాప్ ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com